Sunday, April 30, 2023

BRAND - QUALITY - 2




జె.పి., జె.డి. - గాంధీ, మోదీ



రాజకీయాలలో జె.పి., జె.డి. లాంటి వ్యక్తులను ప్రజలు ఎన్నుకోకపోవడానికి కారణం వారు నాణ్యత ఉన్నవ్యక్తులేకానీ, బ్రాండింగ్ ఉన్న వ్యక్తులు కారు.


రాజకీయాలలో గాంధీ, నెహ్రూ ఒకబ్రాండ్...


యన్.టి.ఆర్. ఒక బ్రాండ్....


వై.యస్. ఒక బ్రాండ్....


మోదీ ఒక బ్రాండ్... 


స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ, నెహ్రూ బ్రాండింగ్ రూపుదిద్దుకున్నది.


చలనచిత్రాలలో నటించే కాలంలోనే యన్.టి.ఆర్. అనే బ్రాండ్ రూపుదిద్దుకున్నది. 


రాజశేఖర్ రెడ్డి పరిపాలనాకాలంలో వై.యస్. అనేది ఒక బ్రాండ్‌గా మారింది. 


మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తనను తాను ఒక బ్రాండ్‌గా మార్చుకున్నాడు. 


బ్రాండింగ్ అంటే ప్రజలను సైకలాజికల్‌గా డామినేట్ చేసి, వారు మనలను అంగీకరించేటట్లు చేయడం. దీనినే ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం, ప్రజాదరణను పొందడం అని కొంచెం మర్యాదపూర్వకంగా చెబుతారు. 


అందుకే బ్రాండింగ్ ఉన్న నాయకులను ప్రజలు గంపగుత్తగా ఓట్లు వేసి గెలిపిస్తారు. 


అలాంటి బ్రాండింగ్ ఏదీ జె.పి., జె.డి.ల విషయంలో జరగలేదు. వారు కేవలం నిజాయతీ, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులు మాత్రమే.

 






No comments:

Post a Comment