Sunday, April 30, 2023

మూడుతరాల బానిసత్వం



మూడుతరాల బానిసత్వం


తొలితరం బానిసత్వం ఆఫ్రికన్లకు పరిమితమయ్యింది. ఆఫ్రికా ఖండంలోని నల్లజాతి ప్రజలను అన్యాయంగా, దౌర్జన్యంగా బంధించి అమెరికా తీసుకుపోయి, అక్కడ వారిని సంతలో పశువులను అమ్మినట్లుగా అమ్మితే, కొన్నవారు వారికి ఏమీ చెల్లించకుండా కేవలం బ్రతకడానికి (చావకుండా ఉండటానికి) ఇంత తిండి పెడుతూ, ఎదురు తిరిగితే తీవ్రంగా శిక్షిస్తూ, వారితో జీవితాంతం వెట్టి చాకిరీ చేయించుకునేవారు. తమ యజమాని చెప్పిన పనిని చేయడం తప్ప వారికి ఎలాంటి హక్కులు ఉండేవి కావు. 


ఇంతటి అమానుషమైన బానిస వ్యవస్థను రద్దుచేయాలనే డిమాండ్ చివరికి అమెరికాలో అంతర్యుద్ధానికి (Civil War) దారితీస్తే, అబ్రహాం లింకన్ ఈ వ్యవస్థను రద్దుచేసి, అమెరికాలోని నల్లజాతివారందరికీ విముక్తిని ప్రసాదించాడు. అమెరికాలో ఇప్పుడు మనం చూస్తున్న నల్లవారిలో ఎక్కువమంది వారి సంతతే.      


నల్లజాతీయుల బానిస వ్యవస్థ రద్దవడంతో తెల్లవారి దేశాలలో, వారి వలసలలో (Colonies) శ్రామికుల కొరత ఏర్పడింది. ఆ కొరతను పూడ్చడానికి మలితరం బానిసత్వం మొదలైనది. దాని పేరే ఒప్పంద శ్రామిక (Contract Labour) వ్యవస్థ. భారతదేశం లాంటి వలస పాలిత దేశాలు దీనికి వేదిక అయ్యాయి. 


తెల్లవారి దేశాలలో, వారి వలసలలో పనిచేయడానికి నిర్బంధ విధానంలో కాకుండా, ఒక ఒప్పందాన్ని (Contract) కుదుర్చుకుని, వారిని ఆయాదేశాలకు తీసుకుపోయి పనిచేయించుకునేవారు. నల్లజాతి వారిలా కాకుండా, వీరికి మాత్రం చేసినపనికి ప్రతిఫలం చెల్లించేవారు. భారతదేశంలాంటి దేశాలలోని పేదప్రజల సగటు ఆదాయం కన్నా అది ఎక్కువగా ఉండటంతో, చాలామంది పేదప్రజలు ఒప్పంద కార్మికులుగా మారి, ఆయా దేశాలకు వలసవెళ్ళి, కాలక్రమంలో అక్కడే స్థిరపడిపోయారు.


రెండవ ప్రపంచ యుద్ధానంతర పరిణామాలలో వలసలన్నీ స్వాతంత్ర్యాన్ని పొందడంతో ఈ వ్యవస్థ కూడా దానంతటదే కనుమరుగైపోయింది. ఇప్పుడు వివిధ దేశాలలో మనం చూస్తున్న భారతజాతి ప్రజలలో ఎక్కువమంది ఆ ఒప్పంద కార్మికుల సంతతే. 


ఒప్పంద కార్మిక వ్యవస్థ అంతరించిన పిమ్మట మూడవతరం బానిసలు తలయెత్తారు. వారే Willing Employees. వీరిని ఎవరూ బలవంత పెట్టరు..., ఎవరూ వీరితో ఒప్పందం చేసుకోరు. తమంతట తామే ...అధిక సంపాదన కొరకూ, ఉన్నత జీవన ప్రమాణాలకొరకూ  ఇష్టపూర్వకంగా తరలివెళతారు. 


ఇది కాలక్రమంలో పెరిగి పెరిగి, ఇప్పుడు పెద్దయెత్తున కొనసాగుతున్నది. వీరు ప్రపంచంలోని అన్ని దేశాలనుండి తలయెత్తినా ముఖ్యంగా చైనా, భారత్ లాంటి ఆసియా దేశాల నుండి అధిక సంఖ్యలో ఉన్నారు. వీరు తమ తమ దేశాలలోనే చదువు పూర్తి చేసుకొని, ఉద్యోగం నిమిత్తం అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా మొదలైన ధనిక దేశాలకు వలస వెళ్ళతారు. వీరిలో కొందరు తిరిగి వస్తారు; అధిక సంఖ్యాకులు మాత్రం అక్కడే స్థిరపడతారు. 


ఈ 3G Slavery ఇంకెంత కాలం కొనసాగుతుందో, ఎప్పుడు అంతరిస్తుందో కాలమే చెప్పాలి. 





చదువులలో వర్గభేదాలు




చదువులలో వర్గభేదాలు


సమాజంలో సాధారణ ప్రజల పిల్లలు మంచి ఉద్యోగంలో స్థిరపడటానికి ఐ.ఐ.టి., యన్.ఐ.టి., ఐ.ఎ.యస్., ఐ.పి.యస్. మొదలైనవి చదవడానికి ప్రయత్నిస్తారు.

 

ఉన్నత వర్గాల పిల్లలు మాత్రం తమ కుటుంబానికి చెందిన సంపదను కాపాడుకోవడానికి, వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికి యం.బి.ఎ., కామర్స్, ఎకనామిక్స్, సైకాలజి, మాస్ కమ్యూనికేషన్ మొదలైనవి చదువుతారు. 





BRAND - QUALITY - 2




జె.పి., జె.డి. - గాంధీ, మోదీ



రాజకీయాలలో జె.పి., జె.డి. లాంటి వ్యక్తులను ప్రజలు ఎన్నుకోకపోవడానికి కారణం వారు నాణ్యత ఉన్నవ్యక్తులేకానీ, బ్రాండింగ్ ఉన్న వ్యక్తులు కారు.


రాజకీయాలలో గాంధీ, నెహ్రూ ఒకబ్రాండ్...


యన్.టి.ఆర్. ఒక బ్రాండ్....


వై.యస్. ఒక బ్రాండ్....


మోదీ ఒక బ్రాండ్... 


స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ, నెహ్రూ బ్రాండింగ్ రూపుదిద్దుకున్నది.


చలనచిత్రాలలో నటించే కాలంలోనే యన్.టి.ఆర్. అనే బ్రాండ్ రూపుదిద్దుకున్నది. 


రాజశేఖర్ రెడ్డి పరిపాలనాకాలంలో వై.యస్. అనేది ఒక బ్రాండ్‌గా మారింది. 


మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తనను తాను ఒక బ్రాండ్‌గా మార్చుకున్నాడు. 


బ్రాండింగ్ అంటే ప్రజలను సైకలాజికల్‌గా డామినేట్ చేసి, వారు మనలను అంగీకరించేటట్లు చేయడం. దీనినే ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం, ప్రజాదరణను పొందడం అని కొంచెం మర్యాదపూర్వకంగా చెబుతారు. 


అందుకే బ్రాండింగ్ ఉన్న నాయకులను ప్రజలు గంపగుత్తగా ఓట్లు వేసి గెలిపిస్తారు. 


అలాంటి బ్రాండింగ్ ఏదీ జె.పి., జె.డి.ల విషయంలో జరగలేదు. వారు కేవలం నిజాయతీ, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులు మాత్రమే.

 






BUY QUALITY - SELL BRAND

 



BUY QUALITY - SELL BRAND



నాణ్యత ఒక్కదాని ద్వారా నీవు ప్రజాదరణను పొందలేవు. బ్రాండింగ్ కావాలి. నాణ్యత, బ్రాండింగ్ రెండూ ఉంటే మంచిదే కానీ ప్రజల విశ్వాసం చూరగొనడంలో నాణ్యత పాత్ర స్వల్పం. అది నీ నైతికతకు మాత్రమే అద్దం పడుతుంది. నాణ్యతను గుర్తించేంత శ్రమను ఎక్కువమంది ప్రజలు తీసుకోరు. వారు గొర్రెలవంటివారు. మిగతావారు ఏంచేస్తున్నారో గమనించి తామూ అదే పనిని చేస్తారు. బ్రాండింగ్ మాయాజాలంతో ముందు కొంత మందిని రాబడితే మిగిలిన వారు కూడా మిడతలదండు వలే వచ్చి చేరతారు.


నీవు మాత్రం కొనేటపుడు నాణ్యతను కొను... తక్కువ ధరకు వస్తుంది. అమ్మేటపుడు బ్రాండ్‌ను అమ్ము... అధిక ధర పలుకుతుంది. 




ప్రాణప్రదమైనవి



ప్రాణప్రదమైనవి


ATMOSPHERE IS MORE THAN LIFE 

Because it decides your character and that character decides your DESTINY.

In the long run of your life your character (not your efforts) only transforms into your destiny. So associate with good people and always dismiss the bad company.



EDUCATION IS EQUAL TO LIFE

Because it decides your career and that career decides your SUCCESS.

Education is not always formal. Any form of learning is called Education. So don't loose any opportunity to learn anything worthy.



NUTRITION IS NEXT TO LIFE

Because it decides your health and that health decides your PHYSICAL WELL-BEING.

 Do not consider food as an expenditure. It is an investment. You can do anything in the world only if you are physically fit. So take nutrient food and avoid bad habits. 


జీవితంలో దేన్ని అయినా వాయిదా వేయి కానీ, ఈ మూడింటినీ ఎన్నడూ వాయిదా వేయకు. ఎందుకంటే ఇవి ఎప్పటికప్పుడు జరగాల్సినవి... ఎల్లప్పుడూ జరగాల్సినవి. ఒకవేళ వాయిదావేస్తే ఆలోటును పూడ్చుకునే అవకాశాన్ని జీవితం నీకెప్పటికీ ఇవ్వదు.